బతకమ్మ వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు

వేంసూరు మండలం భరణిపాడు గ్రామంలో శనివారం జరిగిన పలు బతకమ్మ వేడుకల్లో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్ పాల్గొన్నారు. ఆయన మహిళలతో కలిసి బతకమ్మ ఆటలు ఆడుతూ, పాటలు పాడుతూ ఆనందపరిచారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి ఏఎంసి వైస్ చైర్మన్ గొర్ల వెంకటప్ప రెడ్డి, వేంసూరు మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామ కాంగ్రెస్ నాయకులు, మహిళా, యూత్, ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్