ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. సిట్ అధికారులు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇంటికి వెళ్లి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. 2023 ఎన్నికల సమయంలో తుమ్మల ఫోన్ ట్యాప్ అయ్యిందని పోలీసులు తెలిపారు. కాగా ఇప్పటికే పలు పార్టీల్లోని కీలక నేతల వాగ్మూలం నమోదు చేసిన విషయం తెలిసిందే.