ఖమ్మం జిల్లా సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమ్మెల్యే బట్ట రాగమయి పోలియో చుక్కల కార్యక్రమాన్ని ఆదివారం ప్రారంభించారు. ఐదేళ్ల లోపు పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రిహన బేగం కమల్ పాషా, వైస్ చైర్మన్ బొంతు సుమలత వేణు, AMC చైర్మన్ దోమ ఆనంద్, మున్సిపల్ కౌన్సిలర్లు, పట్టణ అధ్యక్షులు గాదె చెన్నారావు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.