తల్లాడ మండలం నారాయణపురం గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ కొంపల్లి రాము ఇటీవల కరెంట్ షాక్ తో మరణించినారు. శనివారం రాము కుటుంబాని ఎమ్మెల్యే మట్టారాగమయి పరామర్శించారు. అనంతరం విద్యుత్ శాఖ సహాకారంతో మంజూరైన చెక్కును ఎలక్ట్రికల్ డిఈ రాముల నాయక్ బాధిత కుటుంబానికి అందజేశారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.