వైరా పట్టణం, పల్లిపాడు గ్రామాలలో జరుగుతున్న ఎస్ఐఆర్ (ఓటరు జాబితా సవరణ) ప్రక్రియను జిల్లా కలెక్టర్ దివాకర టి. ఎస్. గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా, ఆయన ఓటరు జాబితా సవరణ పనులను పరిశీలించి, బూత్ లెవల్ అధికారులకు పలు సూచనలు చేశారు. ఎస్ఐఆర్ ప్రక్రియ పారదర్శకంగా, నిబంధనల ప్రకారం నిర్వహించాలని, అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో నమోదయ్యేలా చూడాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.