ఖమ్మం జిల్లాలోని కొణిజర్ల మండల కేంద్రంలో యూరియా ఎరువు కోసం రైతులు భారీగా బారులు తీరారు. ఈ సీజన్లో మొక్కజొన్న సాగు పెరగడంతో యూరియా డిమాండ్ పెరిగింది. సరఫరా తక్కువగా ఉండటంతో రైతులు గంటల తరబడి ఎదురుచూస్తున్నారు.