ప్రభుత్వం విశ్రాంత ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని వైరా మండల పెన్షనర్ల సంఘం అధ్యక్షుడు సత్యనారాయణ కోరారు. గురువారం మండల తహసిల్దార్ కార్యాలయం ఎదుట విశ్రాంత పెన్షనర్లు నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం తహసిల్దారు పలు సమస్యలతో కూడిన వినతి పత్రం అందించారు. పెండింగ్లో ఉన్న నాలుగు డిఏలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని పెన్షనర్లు కోరారు.