కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన విబిజి రాంజీ బిల్లును రద్దు చేయాలని గతంలో ఉన్న మహాత్మా గాంధీ ఉపాధి పథకాన్ని యధావిధిగా కొనసాగాలని రెబ్బవరం, పుల్లాపురం, గన్నవరం ,ఖానాపురం, కొండకుడిమ ,గ్రామాల్లో గ్రామపంచాయతీ కార్యదర్శులకు బుధవారం వినతి పత్రాలు అందజేశారు. ప్రజా సంఘాల నాయకులు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు తూము సుధాకర్, సిఐటియు జిల్లా నాయకులు తోట నాగేశ్వరరావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.