సేవాలాల్ సేన ఏన్కూర్ మండల కమిటీని సోమవారం ఏర్పాటు చేశారు. బోడ ప్రవీణ్ మండల అధ్యక్షుడిగా, దారవత్ సునీల్ ఉపాధ్యక్షుడిగా, గుగులోత్ మజిలాల్ వర్కింగ్ ప్రెసిడెంట్గా, ధర్మంషోత్ రమేష్ నాయక్ అధికార ప్రతినిధిగా, గుగులోత్ అమృత రాజు సాదు సేవాలాల్ ధర్మజాగర సేన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. జాతి ఐక్యత, సంప్రదాయ పరిరక్షణ కోసం పనిచేస్తామని సభ్యులు ప్రమాణం చేశారు. జిల్లా అధ్యక్షులు భుక్యా నరసింహారావు నియామక పత్రాలు అందించారు.