గురువారం వైరా కామిశెట్టి కల్యాణ మండపంలో జరిగిన మున్సిపల్ బీజేపీ అభ్యర్థుల సమావేశంలో, బీజేపీ రాష్ట్ర కోశాధికారి దేవకి వాసుదేవరావు పాలకులు వైరా మున్సిపాలిటీ అభివృద్ధిని నిర్లక్ష్యం చేసి, కేవలం కమీషన్లు, వాటాల కోసమే పనిచేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర కార్యదర్శి మహిపాల్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావుతో కలిసి ఆయన మాట్లాడుతూ, వైరా మున్సిపాలిటీ అనేక సమస్యలతో సతమతమవుతోందని విమర్శించారు.