ఇల్లందు మండలంలో ఆదివారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బొజ్జాయిగూడెం గ్రామ పంచాయతీ సమీపంలో ఓ కారు ఇసుక లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు. కారు ముందు భాగం నుజ్జునుజ్జు అయింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.