ఇల్లందు పట్టణంలోని భవాని బార్ షాపులో మద్యం సేవిస్తుండగా ముక్తి కొమరయ్య (35) అనే వ్యక్తి స్పృహ తప్పి కుప్పకూలి మృతి చెందాడు. సహచరులు అతన్ని ఆసుపత్రికి తరలించి సీపీఆర్ చేసినా ఫలితం లేకపోయింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.