ఆసిఫాబాద్లో వనమహోత్సవం-2026 కార్యక్రమంలో భాగంగా నిర్దేశిత లక్ష్యం మేరకు మొక్కలు నాటి సంరక్షించాలని జిల్లా కలెక్టర్ కె. హరిత అధికారులను ఆదేశించారు. బుధవారం జరిగిన సమీక్షా సమావేశంలో, 2026 సంవత్సరానికి జిల్లాలో 46 లక్షల 78 వేల మొక్కలు నాటడం లక్ష్యంగా నిర్దేశించినట్లు కలెక్టర్ తెలిపారు. ఇందులో గ్రామీణాభివృద్ధి శాఖకు 32.50 లక్షలు, అటవీ శాఖకు 6.45 లక్షలు, మున్సిపల్ శాఖకు 3.20 లక్షల మొక్కలు కేటాయించారు.