రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ శుక్రవారం విడుదల చేసిన పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షా ఫలితాల్లో కొమురం భీం జిల్లా విద్యార్థులు 62. 25 శాతం మంది ఉత్తీర్ణత సాధించినట్లు డీఈఒ పీ అశోక్ ప్రకటించారు. ఈ నెల మొదటి వారంలో జరిగిన ఈ పరీక్షల్లో 665 మంది బాలురు, 445 మంది బాలికలు మొత్తంగా 1110 మంది పరీక్షలకు హాజరు కాగా. 389 మంది బాలురు, 302మంది బాలికలు ఉత్తీర్ణత సాధించినట్లు వివరించారు.