తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సివిల్ సప్లై హమాలీ కార్మికుల సమ్మె 7 రోజులుగా కొనసాగుతుంది. మంగళవారం హైదరాబాద్ లోని ఎర్రమంజిలోని జలసౌధ రాష్ట్ర కార్యాలయంలో మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డిని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో ఏఐటియుసి ప్రతినిధి బృందంతో సమావేశం నిర్వహించారు. మంత్రి 2 రోజుల్లో జిఓను విడుదల చేస్తామన్నారు. దీంతో సమ్మెను విరమిస్తున్నట్లు నాయకులు తెలిపారు.