ఆసిఫాబాద్ మండలంలోని చోర్పల్లి గ్రామంలో శుక్రవారం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ మహిళా శక్తి పథకం కింద మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ కమ్మరి పెంటయ్య, ఉప సర్పంచ్ చిట్ల నారాయణ ముఖ్య అతిథులుగా హాజరై చీరలను పంపిణీ చేశారు. మహిళలను ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ పథకం అమలు చేస్తున్నట్లు ఉప సర్పంచ్ తెలిపారు. అర్హులైన ప్రతి మహిళకు ప్రభుత్వ పథకాలు చేరేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.