కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఎస్పి కాంతిలాల్ పాటిల్ ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించి, బాధితులకు త్వరితగతిన న్యాయం కల్పించేందుకు సంబంధిత పోలీస్ అధికారులను ఆదేశించారు. ప్రజలు స్వేచ్ఛగా పోలీస్ సేవలను వినియోగించుకోవాలని, ప్రతి సోమవారం ప్రజావాణి ద్వారా సమస్యలు పరిష్కరిస్తున్నామని తెలిపారు.