రెబ్బెన మండలం రాంపూర్ గ్రామ శివారులోని మార్కెట్ యార్డు సమీపంలో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక కుప్పలను అధికారులు సీజ్ చేశారు. ఆర్ఐ సౌమ్య, జీపీవో రవి సంఘటన స్థలానికి చేరుకుని తనిఖీలు నిర్వహించి చర్యలు చేపట్టారు. రాంపూర్ గ్రామ ఉపసర్పంచ్ చాపిడి పురుషోత్తం, చల్లూరి మాధవ్ ఆధ్వర్యంలో ఇసుక కుప్పలను స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా ఇసుక నిల్వలపై చర్యలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు.