కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో శనివారం షీ టీం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఏఎస్ఐ పసివుద్దీన్, షీ టీం ఇన్ ఛార్జ్ సునీత షీటీం గురించి వివరిస్తూ విద్యార్థులందరూ సైబర్ నేరాల పట్ల అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. ఈ ప్రోగ్రాంలో స్కూల్ యాజమాన్యం హెచ్ఎం నలంద, ఇతర ఉపాధ్యాయురాలు, షీ టీం సిబ్బంది ఏఎస్ఐ పసివుద్దీన్, హెచ్సి సునీత, హోమ్ గార్డ్ స్వప్న, శ్రీలత పాల్గొన్నారు.