ఎస్‌ఐఆర్ ప్రక్రియలో సహకరించాలి: కలెక్టర్

ఆసిఫాబాద్‌లో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియ విజయవంతం చేయడానికి రాజకీయ పార్టీలు సహకరించాలని జిల్లా కలెక్టర్ కె. హరిత కోరారు. బుధవారం జరిగిన సమీక్షలో, బూత్ స్థాయి ఏజెంట్లు క్షేత్రస్థాయిలో పర్యటించి, ఓటర్లు నింపిన ఫారాలను తిరిగి అందేలా చూడాలని సూచించారు. ఇప్పటివరకు 94% ఫారాల పంపిణీ పూర్తయిందని, 11,310 మంది ఓటర్ల వివరాలు డిజిటలైజ్ అయ్యాయని, ఇంకా 23 రోజుల గడువు ఉందని తెలిపారు.

సంబంధిత పోస్ట్