ఆసిఫాబాద్ నియోజకవర్గంలో రాష్ట్ర భూగర్భ ఘనుల శాఖ మంత్రి వివేక్ వెంకట స్వామి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్తో కలిసి ఆదివారం పర్యటించారు. నార్నూర్ మండల కేంద్రంలో గౌతమ బుద్ధ విగ్రహానికి పూల మాల వేసి, కార్యకర్తలతో ముచ్చటించారు. బాబా సాహెబ్ ఆశయాల సాధనకు కృషి చేస్తామని చెప్పారు. స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.