కాగజ్నగర్ మండలం ఎన్జీవోస్ కాలనీలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను కొమురంభీం జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి శుక్రవారం పర్యవేక్షించారు. ఈ సందర్భంగా పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. నిర్మాణ దశలను రికార్డుల్లో నమోదు చేసి, అర్హులైన లబ్ధిదారులకు బిల్లులు మంజూరు చేయాలని సూచించారు. అలాగే పాఠశాల మధ్యాహ్న భోజనం, శుద్ధమైన త్రాగు నీరు అందించాలని అధికారులను కోరారు.