కాగజ్నగర్ మండలంలోని లైనుగూడ గ్రామ పంచాయతీని ఎంపిడీఓ కోట ప్రసాద్ బుధవారం సందర్శించారు. పారిశుధ్యాన్ని పరిశీలించిన అనంతరం నర్సరీను పరిశీలించి, మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలని కార్యదర్శి రాజేశ్వర్కి సూచించారు. మారెపల్లి నుంచి లైనుగూడ వరకు రోడ్డుపై ఇరువైపులా మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ చంద్రశేఖర్, హౌసింగ్ ఏఈ మహేష్ పాల్గొన్నారు.