కాగజ్నగర్ మండలంలోని మోసం శివారులో ఫారెస్ట్ అధికారులు పట్టా భూముల్లో చెట్లు నాటి రైతులను సాగు చేసుకోకుండా అడ్డుకుంటున్నారంటూ బుధవారం సిర్పూర్ ఎమ్మెల్యే డా. పాల్వాయి హరీష్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రెవెన్యూ-ఫారెస్ట్ శాఖలు జాయింట్ సర్వే చేసి హద్దులు నిర్ణయించకుండానే చెట్లు నాటడాన్ని ఖండించారు. రైతులతో కలసి కలెక్టర్ను కలవనున్నట్లు తెలిపారు.