దహెగాం మండల కేంద్రంలో ఆదివారం నమ్మదగిన సమాచారం మేరకు బాబాజీ ఇంట్లో తనిఖీ చేయగా 7 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టుబడ్డాయి. ఈ ఘటనపై ఎస్ఐ రమేష్ కేసు నమోదు చేసి, బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ సంఘటన మధ్యాహ్న సమయంలో జరిగింది.