రంగస్థల నటుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన కోట శ్రీనివాసరావు.. దాదాపు 20 ఏళ్లు నాటకరంగంలో అనుభవం సంపాదించి, 1978లో ‘ప్రాణం ఖరీదు’ సినిమాతో తెలుగు చిత్ర సీమలో అడుగుపెట్టారు. అప్పటి నుంచి ఇప్పటివరకు 750కి పైగా చిత్రాల్లో నటించారు. ముఖ్యంగా బాబూ మోహన్తో 60కి పైగా సినిమాల్లో స్క్రీన్ని పంచుకున్నారు. వారిద్దరి కాంబినేషన్లోని కామెడీ టైమింగ్తో ప్రేక్షకులను ఫిదా చేశారు.