అశ్వారావుపేట మండలంలోని దుబ్బతోగు శివారులో పేకాట ఆడుతున్నారనే సమాచారంతో ఎస్ఐ టి. యయాతిరాజు ఆధ్వర్యంలో మంగళవారం తనిఖీలు నిర్వహించారు. ఈ దాడుల్లో ఐదుగురిని అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుండి రూ. 10, 400 నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.