దమ్మపేట మండలం మొద్దులగూడెం గ్రామానికి చెందిన ఈదా నాగేందర్ (27) అనే యువకుడు అదృశ్యమైన ఘటనపై పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. అయుష్ కంపెనీలో మొక్కజొన్న సీడ్ అర్గనైజర్ గా పనిచేస్తున్న నాగేందర్, గత నెల 31న పని నిమిత్తం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడంతో, అతని భార్య రమ్యశ్రీ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.