జూలూరుపాడు మండలంలో ప్రతి పేదవారికి ఇందిరమ్మ ఇల్లు అందేలా చర్యలు తీసుకోవాలని విద్యార్థి గిరిజన సంఘం అధ్యక్షుడు బానోత్ రాంబాబు నాయక్ ఆధ్వర్యంలో వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్కు గురువారం వినతిపత్రం అందించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి అర్హుడికి ఇల్లు కల్పించేందుకు కృషి చేస్తానని తెలిపారు.