మూడేళ్లలో భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో అభివృద్ధి పనులను పూర్తి చేయాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. మార్చిలో జరగనున్న శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని హైదరాబాద్లో దేవాదాయశాఖ కమిషనర్ హరీశ్తో బుధవారం సమీక్షించారు. బృహత్తర ప్రణాళిక గురించి చర్చించి, ఏఏ పనులు ఎలా చేయాలన్న ప్రణాళికకు సంబంధించిన మ్యాప్ ను పరిశీలించి సూచనలిచ్చారు.