కేజీబీవీలలో పని చేసే ఉపాధ్యాయులు, ఇతర సిబ్బందికి కనీస టైం స్కేలు మంజూరు చేయాలని టీఎస్ యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి ఎస్. విజయ్ కుమార్ ప్రభుత్వాన్ని గురువారం డిమాండ్ చేశారు. టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గురువారం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో మండల కేంద్రంలోనిల కేజీబీవీలో నల్ల బ్యాడ్జీలు ధరించి ఉపాధ్యాయులతో కలిసి నిరసన తెలిపారు.