ఛత్తీస్గఢ్ కొండగావ్, నారాయణపూర్ జిల్లాల సరిహద్దులో ఉన్న కిలాం - భార్గం అడవుల్లో మావోయిస్టులకు, భద్రతా బలగాలకు చోటుచేసుకున్న ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టు కీలక నేతలు మృతి చెందారు. మృతి చెందిన వారు ఈస్ట్ బస్తర్ డివిజన్ కు చెందిన డీవీసీఎం సభ్యుడు హల్దర్, ఎసీఎం రామేగా పోలీసులు గుర్తించారు. ఎన్కౌంటర్ ప్రాంతం నుండి ఎకే -47 రైఫిల్ తో పాటు పలు పేలుడు పదార్థాలు లభ్యం అయ్యాయని, సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుందని బస్తర్ రేంజ్ ఐజీ సుందర రాజ్ తెలిపారు.