చర్ల మండలంలో కాపుసారా విక్రయదారులపై ఆబ్కారీ అధికారులు బైండోవర్ కేసులు నమోదు చేశారు. వివిధ గ్రామాలకు చెందిన 15 మందిని తహసీల్దార్ శ్రీనివాస్ ఎదుట మంగళవారం హాజరుపరిచారు. మరోసారి సారా విక్రయాలు జరిపితే రూ. లక్ష వరకు జరిమానా విధిస్తామని తహసీల్దార్ హెచ్చరించారు. ఈ ఘటనలో ఆబ్కారీ అధికారులు పాల్గొన్నారు.