చర్ల నుండి ఇతర రాష్ట్రాలకు గోవుల అక్రమ రవాణా కొనసాగుతోంది. సుమారు 1,200 గోవులను తరలించేందుకు ముఠాలు సిద్ధమవ్వగా, ఇప్పటికే 800 మూగజీవాలను తరలించినట్లు సమాచారం. చెక్ పోస్టుల వద్ద తనిఖీలు లేకపోవడంపై స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లోపంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జంతు ప్రేమికులు ఉన్నతాధికారులు స్పందించి ఈ అక్రమ రవాణాను అడ్డుకోవాలని కోరుతున్నారు.