ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి సిఫారసుతో లక్ష్మీదేవిపల్లి మండలం ఆర్య తండాకు చెందిన భావసింగ్కు రూ. 60 వేల విలువైన చెక్కును రేగళ్ల సర్పంచ్ లావుడియా పూర్ణ నాయక్ అందజేశారు. ఆపద సమయంలో ఆర్థిక ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం నిరుపేదలను ఆదుకుంటోందని, నిరుపేదలకు ఆరోగ్య భరోసా కల్పించడంలో సీఎంఆర్ఎఫ్ ఎంతో దోహదపడుతుందని ఆయన అన్నారు.