కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని పాత కొత్తగూడెం నూతన వెన్నెల నగర్ కాలనీలో 75 గజాల ప్రభుత్వ స్థలం కలిగిన లబ్ధిదారులకు రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని సేవ్ కొత్తగూడెం, సేవ్ కార్పొరేషన్ కన్వీనర్ జలాల్ డిమాండ్ చేశారు. శుక్రవారం వెన్నెలనగర్లో జరిగిన లబ్ధిదారుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మొదటి విడతలో నామమాత్రపు కేటాయింపులు జరిగాయని, రెండో విడతలో 550 మందికి ఇళ్లు కేటాయించేలా కృషి చేయాలని కోరారు.