కొత్తగూడెం కలెక్టర్ జితేష్ వి. పాటిల్ సోమవారం కొత్తగూడెం ఫుడ్ కోర్టులోని మహిళా శక్తి క్యాంటీన్లో మేకపాల స్టాల్ను సందర్శించారు. మేకపాలు గేదె, ఆవుపాలతో పోలిస్తే శ్రేష్ఠమై స్వచ్ఛంగా ఉంటాయని తెలిపారు. మేకలు పెంపకానికి జిల్లా అనుకూలమని, లీటరు మేకపాలను రూ.80కి అమ్మితే రైతులకు నెలకు రూ.3000–4000 ఆదాయం లభిస్తుందని అన్నారు.