కొత్తగూడెంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం ప్రారంభించారు. భారతదేశంలోనే అత్యున్నత యూనివర్సిటీగా దీన్ని అభివృద్ధి చేస్తామని సీఎం పేర్కొన్నారు. వీలైనంత త్వరగా భవన నిర్మాణాలు పూర్తి చేసి, ఉపయోగంలోకి తెస్తామని, యూనివర్సిటీ నిర్మాణం ఎలా ఉండబోతుందో వివరించే 3డీ వీడియోను ఆయన విడుదల చేశారు.