లక్ష్మీదేవిపల్లిలో బీఆర్ఎస్ నాయకులు శుక్రవారం కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. రాజకీయ కక్షతోనే మాజీ సీఎం కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇచ్చిందని, కాంగ్రెస్ ప్రభుత్వం బూటకపు విచారణలు చేస్తోందని మండల అధ్యక్షుడు కొట్టే వెంకటేశ్వర్లు విమర్శించారు. కేసీఆర్ పై తప్పుడు ఆరోపణలు మానుకోవాలని, లేనిపక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు.