సుజాతనగర్ మండలంలో అమరజీవి కామ్రేడ్ కాసాని ఐలయ్య స్మారక స్థూపాన్ని సీపీఎం కేంద్ర పొలిట్బ్యూరో సభ్యులు బి.వి. రాఘవులు ఆదివారం ఆవిష్కరించారు. అనంతరం పార్టీ శ్రేణులు, సానుభూతిపరులతో భారీ ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా బి.వి. రాఘవులు మాట్లాడుతూ, కాసాని ఐలయ్య వంటి నాయకులు నిజమైన కమ్యూనిస్టులని, నిస్వార్థంగా ప్రజాఉద్యమాలు నిర్వహించి ప్రజలకు సేవ చేశారని అన్నారు. ఆయన నాయకత్వ లక్షణాలను, ప్రజాసేవను కొనియాడారు.