కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పాల్వంచ పట్టణం రాహూల్గాంధీ నగర్లో 20 రోజులుగా తాగునీటి సరఫరా నిలిచిపోయింది. పైప్లైన్లు పగిలి నీళ్లు వృథాగా పోతున్నా కార్పొరేషన్ అధికారులు పట్టించుకోవడం లేదని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల తాగునీటితో పాటు ఇంటి అవసరాల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, ఎమ్మెల్యే, మేయర్ స్పందించి నీటి సరఫరాను పునరుద్ధరించాలని కాలనీవాసులు కోరుతున్నారు.