కరకగూడెం: 12న దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయండి

దేశంలో లేబర్ కోడ్ ల అమలు కార్మిక హక్కులకు మరణ శాసనం లాంటివని, వాటిని ప్రతిఘటించాలని సిఐటియు కరకగూడెం మండల కన్వీనర్ కొమరం కాంతారావు శనివారం పిలుపునిచ్చారు. ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలని కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేశారు. పలు రంగాల్లో సమ్మెకు సంబంధించిన నోటీసులు ఇచ్చారు.

సంబంధిత పోస్ట్