మణుగూరు సింగరేణి ఏరియాలో జనవరి నెలలో 92 శాతం బొగ్గు ఉత్పత్తి నమోదైనట్లు సింగరేణి జీఎం దుర్గం రామచందర్ తెలిపారు. శనివారం జీఎం కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన బొగ్గు ఉత్పత్తి వివరాలను వెల్లడించారు. లక్ష్యం 10,68,000 టన్నులు కాగా, 9,78,932 టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించారు. ఓబీ (ఓవర్బర్డెన్) 88 శాతం వెలికితీసినట్లు కూడా ఆయన ప్రకటించారు.