పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గురువారం మణుగూరు మండలంలో పర్యటించనున్నారు. తిర్లాపురం, రామానుజవరం, సాంబయిగూడెం గ్రామాల్లో సీసీ రోడ్లు ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. అనంతరం అశ్వాపురంలో ఆయిల్ ఫామ్ సాగుపై రైతులకు అవగాహన సదస్సులో పాల్గొంటారు. కావున పార్టీ శ్రేణులు, అధికారులు గమనించి ఎమ్మెల్యే పర్యటనను విజయవంతం చేయాలని కోరారు.