పినపాకలో జరుగుతున్న అండర్-17 జాతీయ కబడ్డీ పోటీలు ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. శనివారం జరిగిన ప్రీ క్వార్టర్ ఫైనల్స్లో పంజాబ్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, పాండిచ్చేరి, రాజస్థాన్, హర్యానా, తమిళనాడు, కర్ణాటక జట్లు తమ ప్రత్యర్థులను ఓడించి క్వార్టర్ ఫైనల్స్కు చేరుకున్నాయి. ఈ విజయాలతో ఈ ఎనిమిది జట్లు తదుపరి దశకు అర్హత సాధించాయి.