పినపాక మండలంలోని గోపాలరావుపేటలో గురువారం ముగ్గురు రైతులకు చెందిన లేగదూడలపై పిచ్చికుక్కలు దాడి చేసి గాయపరిచాయి. బాధితులను పినపాక పశువైద్యశాలకు తరలించి చికిత్స అందించారు. గ్రామంలో కుక్కల బెడద రోజురోజుకూ పెరుగుతోందని, వీధుల్లోకి రావాలంటే భయమేస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి కుక్కల బెడద నుంచి కాపాడాలని వారు కోరుతున్నారు.