రానున్న స్థానిక సంస్థల ఎన్నికల విధులను పోలింగ్ అధికారులు పకడ్బందీగా నిర్వహించాలని ఎంపీఓ వెంకటేశ్వర రావు, ఎంఈఓ నాగయ్య సూచించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు శనివారం పినపాక మండలం ఈ బయ్యారంలో సమావేశం నిర్వహించి ఎన్నికల ప్రిసైడింగ్ అధికారులకు మాస్టర్ ట్రైనర్లతో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఎన్నికల రోజు నిర్వహించే విధుల గురించి వివరించారు.