తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే-ఐజేయూ) బూర్గంపాడు మండల ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా నూతన కమిటీలను బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాకలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ ఎన్నికల్లో జక్కిరెడ్డి మల్లారెడ్డి అధ్యక్షుడిగా, కోట రమేష్ ప్రధాన కార్యదర్శిగా, దానూరి శ్రీనివాస్ కోశాధికారిగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులు, సహాయ కార్యదర్శులు, ఈసీ సభ్యులను కూడా సమావేశంలో ఏకగ్రీవంగా ఎంపిక చేశారు.