మొంథా తుఫాను కారణంగా నష్టపోయిన మిర్చి, వరి, పత్తి పంటలు పండిన రైతులకు ప్రభుత్వం తక్షణమే పరిహారం చెల్లించాలని అఖిల భారత రైతుకూలీ సంఘం ఇల్లందు మండల ప్రధాన కార్యదర్శి వడివేలు, న్యూడెమోక్రసీ సహాయ కార్యదర్శి మోతిలాల్ డిమాండ్ చేశారు. గురువారం ఏఐకేఎంఎస్ బృందం కొమరారం, పోచారం, బోయి తండాలలో తుఫాను వల్ల దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించి, రైతులకు న్యాయం చేయాలని కోరింది.