తెలంగాణ భవన్ ఎదుట మరోసారి ఉద్రిక్తత నెలకొంది. మంత్రి జూపల్లి గన్పార్క్ వద్దకు వచ్చారనే సమాచారంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చర్చకు సిద్ధమయ్యారు. తెలంగాణ భవన్ నుంచి గన్పార్క్ వరకు ఆయన నడుచుకుంటూ బయలుదేరారు. అయితే, ఈ ఉద్రిక్తత మరింత పెరగకుండా చూసేందుకు పోలీసులు రంగంలోకి దిగి, తెలంగాణ భవన్ గేటు వద్దే కేటీఆర్తో పాటు ఇతర ముఖ్య నేతలను అడ్డుకున్నారు. కేటీఆర్ పాదయాత్రను పోలీసులు నిలిపివేయడంతో తీవ్ర తోపులాట, ఉద్రిక్తత చోటుచేసుకున్నాయి.